AP: ఐదు జిల్లాల్లో జనసేన నూతన మండలాధ్యక్షుల నియామకం

ABN , First Publish Date - 2021-12-28T14:41:02+05:30 IST

ఐదు జిల్లాల్లో జనసేన మండల కమిటీలకు అధ్యక్షుల నియామకం జరిగింది.

AP: ఐదు జిల్లాల్లో జనసేన నూతన మండలాధ్యక్షుల నియామకం

అమరావతి: ఐదు జిల్లాల్లో జనసేన మండల కమిటీలకు అధ్యక్షుల నియామకం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన మండలాధ్యక్షులను నియమించారు. తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలు తొలి విడతలో ఆమోదం తెలిపినవాటిలో ఉన్నాయి. జిల్లా కమిటీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను విశ్లేషించిన అనంతరం పవన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీని స్థానికంగా బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు మండలాధ్యక్షులు అండగా ఉండాలని జనసేనాని ఆకాంక్షించారు. నూతన మండలాధ్యక్షులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-12-28T14:41:02+05:30 IST