కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే: Pawan
ABN , First Publish Date - 2022-06-10T18:40:26+05:30 IST
కోనసీమ క్రాప్ హాలిడే పాపం వైసీపీదే అని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు.
అమరావతి: కోనసీమ క్రాప్ హాలిడే పాపం వైసీపీ(YCP)దే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతాంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంట విరామ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరని... దాదాపు రూ.475 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. రైతుల క్రాప్ హాలీడే ప్రకటనతో రాత్రికి రాత్రే..వారి ఖాతాల్లో రూ.139కోట్లు జమ చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు.క్రాప్ హాలీడే ప్రకటించిన మండలాల్లో సాగు నీరు అందుబాటులో అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. రైతులపై వైసీపీ నేతలవి చౌకబారు విమర్శలన్నారు. ఏ సమస్య వచ్చినా రాజకీయ కోణంలో చూడడం తప్ప వైసీపీ నేతలకు సమస్యను పరిష్కరించే మనస్తత్వం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ రైతులకు జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.