తెలుగు గడ్డపై పుట్టిన విశిష్ట వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరు: Pawan

ABN , First Publish Date - 2022-05-28T19:35:26+05:30 IST

తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తులలో ఎన్టీఆర్ కూడా ఒకరు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

తెలుగు గడ్డపై పుట్టిన విశిష్ట వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరు: Pawan

అమరావతి: తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తులలో ఎన్టీఆర్(NTR) కూడా ఒకరు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజులలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించి అభ్యుదయవాదిగా ఎన్టీఆర్ నిలిచారని తెలిపారు. అటువంటి గొప్ప వ్యక్తి శత జయంతి  సందర్భంగా ఆయనకు పవన్ నమస్కారాలు తెలిపారు. తెలుగు భాషపై ఆయనకు ఉన్న మక్కువ, పట్టు నన్నెంతగానో ఆకట్టుకునేదని అన్నారు. తెలుగు భాష కీర్తి ప్రతిష్టలను ఆయన దేశం నలుదిశలా వ్యాపింప చేసిన తీరు అమోఘమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా భారతదేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Updated Date - 2022-05-28T19:35:26+05:30 IST