పోరస్ ఫ్యాక్టరీలో ప్రమాదం అత్యంత విషాదకరం: Pawan
ABN , First Publish Date - 2022-04-14T18:14:34+05:30 IST
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం అత్యంత విషాదకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
అమరావతి: పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం అత్యంత విషాదకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్టం మీద బతికే కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు. ఎల్టీ పాలిమర్స్ దుర్ఘటనలో ఇచ్చిన విధంగానే కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఒక్కో ప్రమాదానికి ఒక్కో తరహా పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించకూడదని తెలిపారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న 13 మందికి మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు. ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.