గుడిపూడి శ్రీహరి మృతిపై Pavan kalyan దిగ్భ్రాంతి
ABN , First Publish Date - 2022-07-05T16:42:25+05:30 IST
సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మృతిపట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతి: సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (Gudipudi srihari) మృతిపట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘పాత్రికేయ రంగంలో... ప్రత్యేకించి సినిమా జర్నలిజంలో విశేష అనుభవం కలిగిన గుడిపూడి శ్రీహరి కన్నుమూశారని తెలిసి చింతించాను. తెలుగు, ఆంగ్ల పత్రికల్లో సినీ విమర్శకుడిగా శ్రీహరి రాసిన వ్యాసాలు, సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి. తెలుగు చిత్రసీమ ప్రస్థానంలోని అనేక ముఖ్య ఘట్టాలను ఆయన అక్షరబద్ధం చేశారు. సినిమాతోపాటు వర్తమాన రాజకీయ, సామాజిక పరిణామాలపై ‘హరివిల్లు’ శీర్షికతో చేసిన వ్యంగ్య రచనలు ఆయన నిశిత పరిశీలన తెలిపేవి. గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.