జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ విభాగం కమిటీ ఏర్పాటు
ABN , First Publish Date - 2021-07-27T21:57:26+05:30 IST
జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ విభాగం కమిటీ ఏర్పాటు
అమరావతి: జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ విభాగం కమిటీ ఏర్పాటు చేసింది. జనసేన పార్టీ నిర్వహించే కార్యక్రమాల కోసం 14మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర కమిటీకి కళ్యాణం శివ శ్రీనివాస్ కో ఆర్డినేటర్ గా, రాష్ట్ర కమిటీలో ఇద్దరు జాయింట్ కో ఆర్డినేటర్లు, అలాగే నలుగురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులను ప్రకటించింది. జాయింట్ కో ఆర్డినేటర్లుగా... చోడిశెట్టి చంద్రశేఖర సుబ్రహ్మణ్యం, సయ్యద్ విశ్వక్షేన్. ప్రధాన కార్యదర్శులుగా... మండలి దయాకర్ , కాసర్ల ఫణి వంశీ, చింతపల్లి చక్రధర మణికుమార్, ధవళ కీర్తేష్ కుమార్. కార్యదర్శులు గా: వీరవల్లి వంశీ, యడవల్లి విశ్వనాథ్, కేతబోయిన సురేశ్ బాబు, బత్తుల శివ రామకృష్ణ, తోట శ్రీనివాసరావు, కొట్టే వెంకటేశ్వర్లు, బాబూరావు పాలూరు, పి.భవాని రవికుమార్ లను నియమించారు.