‘వైసీపీని దళిత వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణించాలి’

ABN , First Publish Date - 2021-04-14T18:24:42+05:30 IST

‘వైసీపీని దళిత వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణించాలి’

‘వైసీపీని దళిత వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణించాలి’

విజయవాడ: పంజా సెంటర్ ముసాఫిర్ ఖానాను జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పరిశీలించారు. సీఎం జగన్‌ మాటలకు, చేతలకు పొంతనే ఉండటం లేదన్నారు. ముసాఫిర్ ఖానా టీడీపీ హయాంలో 70శాతం పనులు పూర్తైనా రెండేళ్లలో వైసీపీ పట్టించుకోలేదన్నారు. భవానీపురంలో దర్గా మాన్యాన్ని కాజేయాలని మంత్రి వెల్లంపల్లి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వందల కోట్లు దోచుకునేందుకే దర్గా ఆస్తులపై కన్నేశారని మండిపడ్డారు. వైసీపీని దళిత వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణించాలన్నారు.

Updated Date - 2021-04-14T18:24:42+05:30 IST