సాగర్లో జానారెడ్డి గెలుపు ఖాయం: ఉత్తమ్
ABN , First Publish Date - 2021-04-11T18:37:22+05:30 IST
నాగార్జునసాగర్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలుపు ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నల్గొండ: నాగార్జునసాగర్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలుపు ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీలేదని సాగర్ ప్రజలకు తెలుసన్నారు. టీఆర్ఎస్ ఎంత డబ్బు, మద్యం పంచినా ప్రజలు కాంగ్రెస్కే ఓటేస్తారని చెప్పారు. సాగర్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని ఉత్తమ్ ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్ కాంట్రాక్టర్ల కమీషన్ల కక్కుర్తితో బతుకుతోందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ కారు గుర్తును కరెన్సీ గుర్తుగా మార్చేసిందని ఉత్తమ్కుమార్రెడ్డి మండపడ్డారు.