జానారెడ్డి.. కేసీఆర్ తోడుదొంగలు
ABN , First Publish Date - 2021-04-15T09:12:07+05:30 IST
కాంగ్రెస్ నేత జానారెడ్డి-సీఎం కేసీఆర్లు తోడుదొంగలని.. బీజేపీని అడ్డుకునేందుకు డ్రామాలాడుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు.
విజయశాంతి
హైదరాబాద్, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ నేత జానారెడ్డి-సీఎం కేసీఆర్లు తోడుదొంగలని.. బీజేపీని అడ్డుకునేందుకు డ్రామాలాడుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. కాంగ్రెస్ నాయకులతో కేసీఆర్ డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎ్సలో చేరిపోయారని విమర్శించారు. హాలియా బహిరంగ సభలో కేసీఆర్ మాటలు చూస్తే నాగార్జునసాగర్లో ఓటమి భయం పట్టుకున్నట్టు స్పష్టమవుతోందన్నారు. 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన ఐదేళ్ల తర్వాత తెలంగాణ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.