Telangana News: చిన్నారి కేసులో కన్నతల్లి ప్రసన్నే హంతకురాలు: వెస్ట్జోన్ డీసీపీ
ABN , First Publish Date - 2022-08-02T03:13:01+05:30 IST
చిన్నారి హత్యకేసు వివరాలు వెస్ట్జోన్ డీసీపీ సీతారామ్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
జనగామ: చిన్నారి హత్యకేసు వివరాలను వెస్ట్జోన్ డీసీపీ సీతారామ్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 12 నెలల చిన్నారిని చంపి.. తల్లి డ్రామా ఆడిందని తెలిపారు. చిన్నారి కేసులో కన్నతల్లి ప్రసన్నే హంతకురాలని తెలిపారు. మృతిచెందిన పసిపాప అనారోగ్య సమస్యలతో ఉందని, భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు ప్రసన్నపై కేసునమోదు చేశామని తెలిపారు. చిన్నారిలో ఎదుగుదల లోపించడమే హత్యకు కారణమని పేర్కొన్నారు. పోలీసులను తప్పుదారి పట్టించడం కోసం.. చైన్స్నాచింగ్ పేరుతో డ్రామా ఆడిందని డీసీపీ సీతారామ్ వెల్లడించారు. చిన్నారి ప్రాణం తీసిన కేసులో తల్లిపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. తల్లి ప్రసన్న పొంతన లేని సమాధానాలు చెప్పడంతో మరింత అనుమానాలు రేకెత్తించాయి. పసికందు సంపులో పడిందని ముందుగా స్థానికులకు ఆమె తెలిపారు. కాసేపటికే మాటమార్చి చైన్స్నాచింగ్కు యత్నించిన దుండగుడు పసికందును లాక్కుని సంపులో పడేశాడంటూ పేర్కొన్నారు. ప్రసన్న పొంతన లేని జవాబులతో కుటుంబసభ్యులను పోలీసులకు ఫిర్యాదు చేశారు.