ఉక్రెయిన్‌లో చిక్కుకున్న జనగామ విద్యార్థులు

ABN , First Publish Date - 2022-02-25T02:13:21+05:30 IST

భీకర పోరు జరగుతున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జనగామ

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న జనగామ విద్యార్థులు

హైదరాబాద్: భీకర పోరు జరగుతున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జనగామ విద్యార్థులు చిక్కుకున్నారు. విద్యార్థులు అక్కడ ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదవుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో  తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాసేపటి క్రితం సతీష్‌ అనే విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. ఉక్రెయిన్‌లో భయంకరంగా ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. బంకర్లలో దాచుకునేందుకు వెళ్తున్నామని సతీష్ తెలిపాడు. తర్వాత ఫోన్ కలవకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-02-25T02:13:21+05:30 IST