చంద్రబాబుకు జన నీరాజనం

ABN , First Publish Date - 2022-05-21T05:35:17+05:30 IST

కర్నూలు నగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి, డోన్‌ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలం జలదుర్గంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆ పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరువెంకటరెడ్డి అన్నారు.

చంద్రబాబుకు జన నీరాజనం

జిల్లా వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలు, నాయకులు 

సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి 


కర్నూలు (అగ్రికల్చర్‌), మే 20: కర్నూలు నగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి, డోన్‌ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలం జలదుర్గంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆ పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల  అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరువెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చి పార్టీకి, చంద్రబాబు నాయకత్వానికి తాము అండగా ఉన్నామని రుజువు చేశారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2022-05-21T05:35:17+05:30 IST