Jammu and Kashmirలో ఉగ్రవాదుల దాడి...సబ్ ఇన్స్పెక్టర్ మృతి
ABN , First Publish Date - 2022-06-18T12:58:54+05:30 IST
జమ్మూకశ్మీరులో శనివారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు...
పుల్వామా(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులో శనివారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పుల్వామాలో జమ్మూ కశ్మీర్ పోలీసు అధికారిని ఉగ్రవాదులు కాల్చిచంపారు.జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ ఫరూక్ అహ్మద్ మీర్ను అతని ఇంటిలోనే ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు అధికారులు శనివారం తెలిపారు.సబ్ ఇన్స్పెక్టర్ ఫరూక్ అహ్మద్ మీర్పై శుక్రవారం అర్ద రాత్రి పాంపోర్ ప్రాంతంలోని సంబూరాలో ఉగ్రవాదులు దాడి చేశారు.మీర్ లెత్పోరాలోని ఐఆర్పీ 23వ బెటాలియన్లో పనిచేసేవాడని పోలీసు అధికారులు తెలిపారు.ఈ ఘటన తర్వాత పుల్వామాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సబ్ ఇన్స్పెక్టరును కాల్చిచంపిన ఉగ్రవాదుల కోసం పోలీసులు శనివారం గాలింపు ప్రారంభించారు.