జమిలి ఎన్నికలు జరగాలి: లక్ష్మణ్
ABN , First Publish Date - 2022-03-22T22:43:57+05:30 IST
దేశంలో జమిలి ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని బీజేపీ నాయకుడు
హైదరాబాద్: దేశంలో జమిలి ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని బీజేపీ నాయకుడు లక్ష్మణ్ అన్నారు. కేంద్రంతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. ఎస్టీ రిజర్వేషన్ల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉందన్నారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ధాన్యం విషయంలో కేసీఆర్ రోజుకో నాటకం ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం ఫైల్స్ సినిమా తీయాలని నిర్మాతలను కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు.