కరోనా ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన ‘జేమ్స్‌ బాండ్‌’

ABN , First Publish Date - 2020-03-06T14:05:07+05:30 IST

‘జేమ్స్‌ బాండ్‌’ సిరీస్‌లో రూపుదిద్దుకున్న ‘నో టైమ్‌ టు డై’ సినిమా విడుదలపై కరోనా ప్రభావం పడింది.

కరోనా ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన ‘జేమ్స్‌ బాండ్‌’

లండన్‌: ‘జేమ్స్‌ బాండ్‌’ సిరీస్‌లో రూపుదిద్దుకున్న ‘నో టైమ్‌ టు డై’ సినిమా విడుదలపై కరోనా ప్రభావం పడింది. ఈ సినిమా విడుదలను ఏడు నెలల పాటు వాయిదా వేశారు. ఈ సినిమాను యూకేలో ఏప్రిల్‌ 8న, ఉత్తర అమెరికాలో ఏప్రిల్‌ 10న విడుదల చేయాలని మొదట భావించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో సినిమా విడుదలను యూకేలో నవంబరు 12న, అమెరికాలో అదే నెల 25న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.

Updated Date - 2020-03-06T14:05:07+05:30 IST