జమలాపురంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-08T05:09:22+05:30 IST
జమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆది వారం ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
ఎర్రుపాలెం, ఆగస్టు7: జమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆది వారం ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఆదివారం యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వరపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, కలశస్థాపన, మండపారాధన నిర్వహించారు. కార్యక్రమాల్లో వ్యవస్థాపక ధర్మకర్త కృష్ణమోహన శర్మ, సూపరిం టెండెంట్ శ్రీనివాస్, ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ పాల్గొన్నారు.