కందులవారిపల్లెలో జల్లికట్టు
ABN , First Publish Date - 2021-01-25T07:05:52+05:30 IST
చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ కందులవారిపల్లెలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు.
పలువురు యువకులకు స్వల్ప గాయాలు
చంద్రగిరి, జనవరి 24: చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ కందులవారిపల్లెలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. అల్లెలోకి వదిలిన కోడెగిత్తలను నిలువరించడానికి యువకులు పోటీపడ్డారు. బహుమతులు చేజిక్కించుకునే క్రమంలో పలువురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. పరిసర గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. వచ్చినవారికి గ్రామస్తులు అన్నదానం చేశారు.