Jaish-e-Mohammed chief: అఫ్ఘానిస్థాన్‌లోనే మసూద్ అజార్

ABN , First Publish Date - 2022-09-17T15:18:51+05:30 IST

జైషే మహ్మద్ చీఫ్(Jaish e Mohammed chief) మసూద్ అజార్(Masood Azhar) కదలికల గురించి పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి(Pakistan foreign minister) బిలావల్ భుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు...

Jaish-e-Mohammed chief: అఫ్ఘానిస్థాన్‌లోనే మసూద్ అజార్

పాక్ విదేశాంగశాఖ మంత్రి వెల్లడి

ఇస్లామాబాద్(పాకిస్థాన్): జైషే మహ్మద్ చీఫ్(Jaish e Mohammed chief) మసూద్ అజార్(Masood Azhar) కదలికల గురించి పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి(Pakistan foreign minister) బిలావల్ భుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.మసూద్ అజార్ అఫ్ఘానిస్థాన్‌(Afghanistan) దేశంలో ఉన్నాడని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ(Bilawal Bhutto Zardari) వెల్లడించారు.మసూద్ అజార్ తమ దేశంలో లేడని అఫ్ఘానిస్తాన్ ఖండించిన నేపథ్యంలో పాక్ మంత్రి తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.



 మసూద్ అజార్ భారత్, పాక్ దేశాల మధ్య త్రైపాక్షిక సమస్యగా మారాడని పాక్ మంత్రి అన్నారు.కాగా మసూద్ అజార్ ఉనికి గురించి పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలను తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ఖండించారు.మసూద్‌ అజార్‌ను ఇస్లామాబాద్‌కు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ పాకిస్థాన్‌ తాలిబాన్‌ ప్రభుత్వానికి లేఖ కూడా పంపినట్లు తెలుస్తోంది.


 

Updated Date - 2022-09-17T15:18:51+05:30 IST