భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళతో ఓ యువకుడి సహజీవనం.. ఊహించని ట్విస్టులతో ఇప్పుడు అతడి పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2021-10-06T23:14:38+05:30 IST

ఆ మహిళ భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి ఉంటోంది. ఉద్యోగం చేస్తున్నప్పుడే భర్త చనిపోవడంతో ఆ స్థానంలో అధికారులు ఆమెకు ఉద్యోగం కల్పించారు. ఈ క్రమంలోనే ఆ మహిళకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆమె ఒంటరి తనానికి

భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళతో ఓ యువకుడి సహజీవనం.. ఊహించని ట్విస్టులతో ఇప్పుడు అతడి పరిస్థితి ఏంటంటే..

ఆ మహిళ భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి ఉంటోంది. ఉద్యోగం చేస్తున్నప్పుడే భర్త చనిపోవడంతో ఆ స్థానంలో అధికారులు ఆమెకు ఉద్యోగం కల్పించారు. ఈ క్రమంలోనే ఆ మహిళకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆమె ఒంటరి తనానికి అతడు తోడుగా నిలిచాడు. ఆమెతో అతడు సహజీవనం చేయడం ప్రారంభించాడు. తర్వాత కొద్ది రోజులకు వారిద్దరి మధ్య మనస్పర్థలు చెలరేగాయి. ఆ తర్వాత ఊహించని ట్విస్టులతో ఇప్పుడు అతడి పరిస్థితి ఏంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకెళ్లాల్సిందే..


ఢిల్లీకి చెందిన గులాబ్ దేవి భర్త గతంలో చనిపోయాడు. భర్త ఉద్యోగం చేస్తున్నపుడే చనిపోవడంతో అధికారులు అతడి స్థానంలో ఆమెకు అవకాశం కల్పించారు. దీంతో ఆమె పిల్లలతో కలిసి ఉద్యోగం చేసుకుంటూ ఢిల్లీలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు బాబూలాల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పరిచయం ప్రేమగా మారి వారిద్దరూ సహజీవనం చేయడం మొదలపెట్టారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో ఆమెను హత్య చేశాడు.




పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబూలాల్ 2011 సంవత్సరంలో రూ. 22 లక్షలతో ఇల్లు కొనుగోలు చేశాడు. అందులో బాబూవి రూ. 17లక్షలు కాగా, గులాబ్ ఐదు లక్షలు ఇచ్చింది. గత రెండు నెలల నుంచి తన కుటుంబంలోని ఒకరిని దత్తత తీసుకోవాలని ఆమె అతడిని పదేపదే అడిగింది. దీంతో బాబూకు తన ఆస్తి తనకు దక్కకుండా పోతుందని భయం పట్టుకుంది. అప్పటి నుంచి గులాబ్‌ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.


ఈ క్రమంలో ఆమెను హత్య చేయడానికి నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక తనొక్కడే హత్య చేయడం కుదరదని రూ. 2.5 లక్షలకు ఓ ముఠాతో బేరం కుదుర్చుకున్నాడు. మాయమాటలు చెప్పి బాధితురాలిని ఢిల్లీ నుంచి జైపూర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మరో అయిదుగురితో కలిసి ఆమెను హత్య చేశాడు. హత్య తర్వాత శవాన్ని కల్వర్ట్‌లోకి విసిరాడు. అంతేకాకుండా బాబూలాల్ ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. బాధితురాలి బ్యాగ్‌లో ఓ సూసైడ్ నోట్ పెట్టాడు. అందులో తన సోదరులతో ఆస్తి గొడవల వల ఆమె ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. కానీ అనుమానం వచ్చిన పోలీసులు తమదైనశైలిలో ప్రశ్నించగా తానే ఐదుగురితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-06T23:14:38+05:30 IST