కుమార్తె కోసం తాప‌త్ర‌యం... ఫోనులో అంత్య‌క్రియ‌లు చూపించిన వైద్యు‌లు

ABN , First Publish Date - 2020-05-20T14:15:18+05:30 IST

రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో అతిపెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన‌ సవాయ్ మాన్సింగ్‌లో కరోనాతో మరణించిన వారి అంత్య‌క్రియ‌ల‌ను సంబంధీకుల‌కు వీడియో కాల్స్‌లో చూపిస్తున్నారు. ఈ విధంగా ఇక్క‌డి వైద్యులు...

కుమార్తె కోసం తాప‌త్ర‌యం... ఫోనులో అంత్య‌క్రియ‌లు చూపించిన వైద్యు‌లు

జైపూర్: రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో అతిపెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన‌ సవాయ్ మాన్సింగ్‌లో కరోనాతో మరణించిన వారి అంత్య‌క్రియ‌ల‌ను సంబంధీకుల‌కు వీడియో కాల్స్‌లో చూపిస్తున్నారు. ఈ విధంగా ఇక్క‌డి వైద్యులు ఆరుగురి అంత్య‌క్రియ‌ల‌ను వారి బంధువుల‌కు చూపించారు. మే 9 న జైపూర్‌లో కరోనాతో నాలుగేళ్ల బాలిక మృతిచెందింది. వారి తల్లిదండ్రుల‌కు క‌రోనా చికిత్స జ‌రుగుతోంది. దీంతో వారు త‌మ కుమార్తెను చివ‌రిసారి కూడా చూసుకోలేని స్థితిలో ఉన్నారు. దీంతో వారి కోరిక మేర‌కు వైద్యులు ఆ చిన్నారి అంత్య‌క్రియ‌ల‌ను త‌ల్లిదండ్రుల‌కు వీడియోకాల్‌లో చూపించారు. అలాగే కొన్ని ఫొటోల‌ను కూడా వారికి పంపించారు. ఎస్ఎంఎస్ హాస్పిటల్‌లోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ సుమంత్ దత్తా  ఆధ్వ‌ర్యంలో క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌ను వారి బంధువుల‌కు వీడియో కాల్ ద్వారా చూపిస్తున్నారు. 

Updated Date - 2020-05-20T14:15:18+05:30 IST