కుమార్తె కోసం తాపత్రయం... ఫోనులో అంత్యక్రియలు చూపించిన వైద్యులు
ABN , First Publish Date - 2020-05-20T14:15:18+05:30 IST
రాజస్థాన్లోని జైపూర్లో అతిపెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన సవాయ్ మాన్సింగ్లో కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలను సంబంధీకులకు వీడియో కాల్స్లో చూపిస్తున్నారు. ఈ విధంగా ఇక్కడి వైద్యులు...
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో అతిపెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన సవాయ్ మాన్సింగ్లో కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలను సంబంధీకులకు వీడియో కాల్స్లో చూపిస్తున్నారు. ఈ విధంగా ఇక్కడి వైద్యులు ఆరుగురి అంత్యక్రియలను వారి బంధువులకు చూపించారు. మే 9 న జైపూర్లో కరోనాతో నాలుగేళ్ల బాలిక మృతిచెందింది. వారి తల్లిదండ్రులకు కరోనా చికిత్స జరుగుతోంది. దీంతో వారు తమ కుమార్తెను చివరిసారి కూడా చూసుకోలేని స్థితిలో ఉన్నారు. దీంతో వారి కోరిక మేరకు వైద్యులు ఆ చిన్నారి అంత్యక్రియలను తల్లిదండ్రులకు వీడియోకాల్లో చూపించారు. అలాగే కొన్ని ఫొటోలను కూడా వారికి పంపించారు. ఎస్ఎంఎస్ హాస్పిటల్లోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ సుమంత్ దత్తా ఆధ్వర్యంలో కరోనా మృతుల అంత్యక్రియలను వారి బంధువులకు వీడియో కాల్ ద్వారా చూపిస్తున్నారు.