కరోనా కట్టడికి వార్‌రూమ్‌లు... 11 పట్టణాల్లో 144 సెక్షన్ అమలు!

ABN , First Publish Date - 2020-09-20T14:54:24+05:30 IST

రాజస్థాన్‌లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తుండటం అక్కడి ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా 1,834 కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ సర్కారు కరోనా...

కరోనా కట్టడికి వార్‌రూమ్‌లు... 11 పట్టణాల్లో 144 సెక్షన్ అమలు!

జైపూర్: రాజస్థాన్‌లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తుండటం అక్కడి ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా 1,834 కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ సర్కారు కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని జిల్లా ముఖ్యకేంద్రాలలోని కొన్ని బహిరంగ ప్రదేశాలలో 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఐదురురికి మించి గుమిగూడటాన్ని నిషేధించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో కరోనా కట్టడికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. 


జిల్లా స్థాయిలో సైతం కోవిడ్-19 వార్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధితులకు సహాయం అందించేందుకు ఈ వార్ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా అధికారులు పర్యవేక్షించనున్నారు. సామూహిక కార్యక్రమాలను అక్టోబరు 31 వరకూ నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అంతిమ సంస్కారాలకు 20 మంది, వివాహాది శుభకార్యాలకు 50 మంది వరకూ పాల్గొనేందుకు అనుమతినివ్వనున్నారు.

Updated Date - 2020-09-20T14:54:24+05:30 IST