యువమంచ్ ఆధ్వర్యంలో జైపూర్ కాళ్ల అమరిక
ABN , First Publish Date - 2021-12-07T05:29:59+05:30 IST
యువమంచ్ ఆధ్వర్యంలో జైపూర్ కాళ్ల అమరిక
తాండూరు: మార్వాడీ యువమంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత జైపూర్ కాళ్ల అమరిక, క్యాలిఫర్ క్యాంప్ను ప్రారంభించారు. తాండూరులోని బాలాజీ మందిర్లో మంచ్ జాతీయ అధ్యక్షుడు లలిత్కుమార్జైన్, రాష్ట్ర అధ్యక్షుడు సురే్షజైన్, తాండూరు ప్రగతి సమాజం అధ్యక్షులు రమేష్ చంద్ర సార్డాలు పాల్గొని ప్రారంభించారు. దివ్యాంగుల కొలతలు తీసుకుని, 9, 10వ తేదీల్లో కాళ్ల అమరిక చేయడం జరుగుతుందని మంచ్ జాతీయ కన్వీనర్ కుంజ్ బిహారి సోని తెలిపారు. ఎవరైనా ఉంటే 7, 8వ తేదీల్లో కూడా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ శిబిరాన్ని సందర్శించారు. మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు మన్మోహన్ సార్డా, ఉపాధ్యక్షుడు మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రోహిత్, కన్వీనర్ శ్రీకాంత్, అనిల్ పాల్గొన్నారు.