అబ్బురపరిచే నిర్మాణశైలి!
ABN , First Publish Date - 2021-04-15T05:30:00+05:30 IST
కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన జైన దేవాలయం అది. ఆ ఆలయ నిర్మాణశైలిని చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. దాదాపు యాభై ఏళ్లపాటు నిర్మాణం జరుపుకొన్న ఆ ఆలయ విశేషాలు ఇవి...
కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన జైన దేవాలయం అది. ఆ ఆలయ నిర్మాణశైలిని చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. దాదాపు యాభై ఏళ్లపాటు నిర్మాణం జరుపుకొన్న ఆ ఆలయ విశేషాలు ఇవి...
- రాజస్థాన్లో పాలి జిల్లాలోని రణక్పూర్ గ్రామంలో, ఆరావళి పర్వత శ్రేణుల సమీపంలో ఈ జైన దేవాలయం ఉంది. ఈ ఆలయం నిర్మాణంలో అద్భుతమైన శిల్పాకళా నైపుణ్యంతో చెక్కిన 1444 రాతి స్తంభాలను ఉపయోగించారు. ఇందులో ఏ రెండూ స్తంభాలు ఒకలా ఉండవు. ఒక్కో రాతి స్తంభం ఒక్కో ఆకృతిలో మలచబడి ఉంటుంది. స్తంభాలపై చెక్కిన శిల్పాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
- 48వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో 29 పెద్ద పెద్ద గదులు, 80 డోములున్నాయి. జైన మతానికి చెందిన వ్యాపారి ధర్మా షా 15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం రాజ్పుత్ మహారాజు రానా కుంభాకు బహుమతిగా ఇచ్చారు.
- తన ఆలోచనతో ధర్మా షా మహారాజుని కలిస్తే, ఆలయానికి కావలసిన స్థలం ఇవ్వడంతో పాటు సమీపంలో టౌన్షిప్ను నిర్మించమని సలహా ఇచ్చాడు. మహారాజు సలహా మేరకు ధర్మా షా ఒకేసారి ఆలయ నిర్మాణపనులను, టౌన్షిప్ పనులను ప్రారంభించాడు. ఆ పట్టణం పేరే రణక్పూర్.
- యాభై ఏళ్ల పాటు జరిగిన ఆలయ నిర్మాణానికి కోటి రూపాయలు ఖర్చయిందని అంచనా. ఈ ఆలయ నిర్మాణంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడి నుంచి మూలవిరాట్టును చూసినా రాతి స్తంభాలు అడ్డుపడకుండా స్పష్టంగా కనిపిస్తుంది.