నాకు మెంటల్

ABN , First Publish Date - 2020-02-14T07:55:13+05:30 IST

నిర్భయ హత్యాచారంలో ఉరిశిక్ష పడిన నలుగురు దోషులు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. శిక్ష అమలుకాకుండా సాగదీసేందుకు రాజ్యాంగపరంగా, చట్టపరంగా అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నారు.

నాకు మెంటల్

సుప్రీంకు తెలిపిన నిర్భయ దోషి వినయ్‌

అతను ఆరోగ్యంగానే ఉన్నాడు: కేంద్రం


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: నిర్భయ హత్యాచారంలో ఉరిశిక్ష పడిన నలుగురు దోషులు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. శిక్ష అమలుకాకుండా సాగదీసేందుకు రాజ్యాంగపరంగా, చట్టపరంగా అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నారు. తిహార్‌ జైల్లో తనను చిత్రహింసలు పెట్టారనీ, దాని కారణంగా తాను మానసిక వ్యాధితో బాధపడుతున్నానని దోషులలో ఒకడైన వినయ్‌ శర్మ సుప్రీంకోర్టుకు గురువారం తెలిపాడు. క్షమాభిక్ష కోసం తాను రాష్ట్రపతికి పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించడాన్ని శర్మ సుప్రీంకోర్టులో సవాలుచేశాడు. తన మానసిక వ్యాధిని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నాడు. అయితే కేంద్రం దీన్ని తోసిపుచ్చింది. వినయ్‌ శర్మ మంచి ఆరోగ్యంతోనే ఉన్నాడని కోర్టుకు తెలిపింది. దీనిపై శుక్రవారం తీర్పు ఇవ్వనున్నట్లు త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది.  

Updated Date - 2020-02-14T07:55:13+05:30 IST