బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో 20ఏళ్ల జైలుశిక్ష
ABN , First Publish Date - 2021-09-16T04:31:32+05:30 IST
బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాలు జైలుశిక్ష రూ.2వేలు జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. చంద్రశేఖర్ప్రసాద్ బుధవారం తీర్పుచెప్పారు.
ఖమ్మం లీగల్, సెప్టెంబరు 15: బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాలు జైలుశిక్ష రూ.2వేలు జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. చంద్రశేఖర్ప్రసాద్ బుధవారం తీర్పుచెప్పారు. కొత్తగూడెం పట్టణానికి చెందిన ఫిర్యాదికి ఇద్దరు సంతానం కాగా వారిలో ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వారిని పట్టణంలోని రామవరం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ గిడ్డ ప్రకాష్ ప్రతిరోజూ తన ఆటోలో పాఠశాలకు తీసుకెళ్లి అక్కడి నుంచి ట్యూషన్కి తీసుకెళ్లి రాత్రి 7గంటలకు ఇంటికి తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 5, 2015న నిందితుడు రోజులాగానే ఇంటిదగ్గర నుంచి పిల్లలను తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చే క్రమంలో మార్గమధ్యంలో జనసంచారం లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి పిల్లలను బెదిరించి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని కొత్తగూడెం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదైంది. ఆ కేసును విచారించిన జిల్లా న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువు కావడంతో బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్త వెంకటేశ్వరరావు వాదించగా కోర్టు కానిస్టేబుల్ జి.భాస్కర్, లైజన్ ఆఫీసర్ రషీద్, ముత్తయ్య, హోంగార్డు ఎండీ అయూబ్లు సహకరించారు.