Telangana: నాలుగు వాహనాలు ఢీ... ఒకరికి గాయాలు
ABN , First Publish Date - 2022-04-23T13:33:16+05:30 IST
జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారిపై నాలుగు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి.
జగిత్యాల: జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారిపై నాలుగు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. పూడూర్ స్టేజీ దాటినా తర్వాత లారీని రెండు వ్యాన్లు ఢీ కొట్టాయి. ఆ వెంటనే కోడి గుడ్ల లోడ్తో వెళ్తున్న వాన్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో స్థానికులు కోడి గుడ్లను ఎగబడి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వాహనాలను అక్కడి నుంచి తొలగించే చర్యలు చేపట్టారు.