జగిత్యాలలో రైతుల ర్యాలీ, మహాధర్నా ప్రారంభం
ABN , First Publish Date - 2021-11-26T17:56:58+05:30 IST
జిల్లా కేంద్రంలో రైతు ర్యాలీ, మహాధర్నా ప్రారంభమైంది.
జగిత్యాల: జిల్లా కేంద్రంలో రైతు ర్యాలీ, మహాధర్నా ప్రారంభమైంది. పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల ర్యాలీ నిర్వహించారు. పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగుతోంది.