Jagityal: ప్రజావాణి ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-06-27T19:52:06+05:30 IST
జిల్లాలోని ప్రజావాణి ఎదుట రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
జగిత్యాల: జిల్లాలోని ప్రజావాణి ఎదుట రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దమ్మన్నపేటకు చెందిన రైతు సాంబయ్య తన భూమిని ఆన్లైన్ నుంచి తొలగించారంటూ ఆవేదన చెందాడు. తీవ్ర మనస్థాపంతో ప్రజావాణి ఎదుట పురుగుల మందు తాగి ఈ అఘాయిత్యానికి యత్నించాడు. వెంటనే గమనించిన పోలీసులు రైతును అడ్డుకున్నారు. అయితే కలెక్టర్ జిల్లా వదిలి పోవాలి అంటూ రైతు నినాదాలు చేశాడు.