జగిత్యాలలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-08-20T19:40:40+05:30 IST

జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు

జగిత్యాలలో కరోనా కలకలం

జగిత్యాల: జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ముగ్గురు పోలీస్ సిబ్బంది ఇటీవల హుజురాబాద్‌లో సీఎం సభకు వెళ్లారు. సీఎం సభ తర్వాత కానిస్టేబుళ్లు ముగ్గురు కరోనా లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. 

Updated Date - 2021-08-20T19:40:40+05:30 IST