Jagital District: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-07-19T18:19:02+05:30 IST
జగిత్యాల జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
జగిత్యాల: జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంచిర్యాల జిల్లా, హాజీపూర్కు చెందిన సంతోష్, శిరిష ఆరు రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమ జంట వెల్లటూరు మండలం, కోటి లింగాలవద్ద గడ్డి మందు తాగి చనిపోతున్నామంటూ కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం ప్రేమజంట జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.