ప్రభుత్వ విప్లుగా జగ్గిరెడ్డి, గోపాలరెడ్డి
ABN , First Publish Date - 2021-08-19T16:55:21+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ విప్లుగా..
అమరావతి(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ విప్లుగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట శాసనసభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి, శాసనమండలి సభ్యుడు వెన్నపూస గోపాలరెడ్డిని ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. వీరిద్దరూ ప్రభుత్వ విప్లుగా శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వానికి, చట్టసభలకు మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.