కేసీఆర్కు జగ్గారెడ్డి లేఖ
ABN , First Publish Date - 2021-12-22T20:51:57+05:30 IST
సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇంటర్ విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనలో ఉన్నారని, విద్యార్థులందరిని
హైదరాబాద్: సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇంటర్ విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనలో ఉన్నారని, విద్యార్థులందరిని పాస్ చేయాలని లేఖలో కోరారు. కరోనా పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసి 35 మార్కులు ఇచ్చాయని గుర్తుచేశారు. ఆలస్యం చేయకుండా విద్యార్థుల భవిష్యత్ కోసం తక్షణం నిర్ణయం తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.