పీర్ల పండుగలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-08-10T06:13:07+05:30 IST

సంగారెడ్డిలో మంగళవారం రాత్రి నిర్వహించిన పీర్ల పండుగ ఊరేగింపులో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు షర్బత్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి సంగారెడ్డి నియోజకవర్గం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

పీర్ల పండుగలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డిలో పీర్ల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి టౌన్‌, ఆగస్టు 9 : సంగారెడ్డిలో మంగళవారం రాత్రి నిర్వహించిన పీర్ల పండుగ ఊరేగింపులో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు షర్బత్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి సంగారెడ్డి నియోజకవర్గం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అన్ని మతాల వారు జరుపుకొనే పండుగలకు సమప్రాధాన్యంతో తాను సహకరిస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేదే తన ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. పీర్ల ఊరేగింపులో హిందూ, ముస్లీం తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రావడంతో సందడి నెలకొన్నది. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T06:13:07+05:30 IST