నన్ను వ్యభిచారి అంటావా? బుద్ధుందా నీకు?: షర్మిలపై జగ్గారెడ్డి ఫైర్
ABN , First Publish Date - 2022-09-27T19:36:40+05:30 IST
‘నన్ను వ్యభిచారి అంటావా? బుద్ది ఉందా నీకు..?’ అంటూ వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (YS Sharmila)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
Hyderabad : ‘నన్ను వ్యభిచారి అంటావా? బుద్ది ఉందా నీకు..?’ అంటూ వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (YS Sharmila)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Congress MLA Jaggareddy) ఫైర్ అయ్యారు. నేడు ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. తనను వ్యభిచారి అంటే ఏమీ కాదని.. కానీ అదే మాట తానంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తాను టీఆర్ఎస్ (TRS)లో ఉన్నప్పుడే పులిని అని పేర్కొన్నారు. వైఎస్తో ఉన్నప్పుడు పులి, ఇప్పుడు పిల్లిలా ఉన్నా అనే షర్మిల మాట అబద్ధమన్నారు. తాను టీఆర్ఎస్లో ఉండగా మున్సిపల్ ఎన్నికల్లో తనను కట్టడి చేయడానికి పోలీస్ను ఉపయోగించారన్నారు. పోలీస్లు లిమిట్ క్రాస్ చేయడంతో అప్పట్లో తాను రిగ్గింగ్ చేశానన్నారు. తన స్టైల్ నచ్చి వైఎస్ పిలిచారని... అభివృద్ధి కోసం ఆనాడు వెళ్ళానన్నారు.
ఇంకా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘‘షర్మిల హద్దుల్లో ఉండాలి. వైయస్ పరువు తీయొద్దు. షర్మిల పెద్ద మోతుబరి కాదు... అసలు ఆమె పంచాయితీ ఏంటో తెలియడం లేదు. ఆమె పాదయాత్ర ఎందుకు చేస్తుందనేది క్వశ్చన్ మార్క్. నన్ను కేటీఆర్ కోవర్ట్ అనడం దురదృష్టకరం. షర్మిల సీఎం కావాలనేది ఆమె కోరిక అని.. ఆమె తల్లి కూడా అదే చెప్పారు. షర్మిల ఏపీలో ఎందుకు తిరగడం లేదు. జగన్కు చెప్పి షర్మిలను ఏపీ సీఎం చేయాలని విజయమ్మకు సలహా ఇస్తున్నా. మీ కుటుంబ సభ్యులంతా సీఎంలుగా ఉండాలనేది మీ కోరిక. మీ ఇంటి పంచాయతీని మా మీద రుద్దకండి. ఏపీకి మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు చేసుకోండి. మూడు రాష్ట్రాలకు మీ ముగ్గురు సీఎంలు కండి. మీకు ముఖ్యమంత్రి పదవుల కోసం రెండు రాష్ట్రాలను నాశనం చేస్తారా? వైయస్ బిడ్డ అని మిమ్మల్ని ఎవరు తిట్టలేక పోతున్నారు. షర్మిల పక్కా బీజేపీ ఏజెంట్, బీజేపీ బినామీ’’ అని పేర్కొన్నారు.
అపాయింట్మెంట్ ఇస్తే కేసీఆర్ను కలుస్తా..
ఇక ఆరోగ్య శ్రీపై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (Arogya Sri) నిర్వీర్యం అయ్యిందన్నారు. పేదలు ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితి ఉందన్నారు. పేదలు అనారోగ్యంతో హాస్పిటల్కు వెళ్లి అప్పుల పాలు అవుతున్నారన్నారు. సీఎం కేసిఆర్ ఆరోగ్య శ్రీని ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ప్రశ్నించారు. డబ్బులు లేక చింపోతున్న ప్రజల ప్రాణాలు ప్రభుత్వం కాపాడాలన్నారు. సీఎంలను ఏ పార్టీ ఎమ్మెల్యేలు అయినా గతంలో కలిసే సంప్రదాయం ఉండేదన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఒకవేళ కలిసినా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) అపాయింట్మెంట్ ఇస్తే కలిసి ఆరోగ్యశ్రీ కోసం అడుగుతానన్నారు.