నేను రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తెలియదు: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2021-12-28T23:35:05+05:30 IST
రేవంత్రెడ్డి మంచి చేస్తే అభినందిస్తా..కరెక్ట్ లేకపోతే ప్రశ్నిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
హైదరాబాద్: రేవంత్రెడ్డి మంచి చేస్తే అభినందిస్తా..కరెక్ట్ లేకపోతే ప్రశ్నిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రేవంత్పై అధిష్టానానికి తాను రాసిన లేఖ ఎలా లీక్ అయ్యిందో తెలియదన్నారు. తమలో మాకు ఎన్ని విభేదాలు ఉన్నా, తమ మీదకు ఎవరువచ్చినా కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి కట్టుగా పోరాడతామన్నారు.
కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నడిపిస్తున్న తీరుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రేవంత్ పనితీరును(స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్) మార్చుకునేలా, నాయకులందరినీ కలుపుకొనిపోయి పార్టీని బలోపేతం చేసేలా ఆదేశించాలంటూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్గాంధీని కోరారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ లైన్లో పనిచేస్తూ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురాగలిగే నాయకుడిని కొత్త చీఫ్గా నియమించాలన్నారు. ఈ మేరకు సోమవారం సోనియా, రాహుల్కు జగ్గారెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు.