Telangana రైతులపై సవతి తల్లి ప్రేమ తగదు

ABN , First Publish Date - 2022-05-25T00:04:57+05:30 IST

తెలంగాణ రైతుల మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు చాలా

Telangana రైతులపై సవతి తల్లి ప్రేమ తగదు

Telangana: తెలంగాణ రైతుల మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని ముందు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయాల కోసమే కేసీఆర్ పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పంటల బీమా పథకం ఎందుకు పెట్టలేదని, నకిలీ విత్తనాలతో నష్టపోతే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైతు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోకుండా చూడాలన్నారు. ఓట్లు వేసి గెలిపించిన రైతులను పరామర్శించని సీఎం పంజాబ్ రైతుల కుటుంబాలను ఆదుకోడానికి వెళ్లడం ఏమిటని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య కుదిరిన ఒప్పందం.. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడానికేనని ఆరోపించారు. ప్రజలు దీన్ని గమనించాలని కోరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త బండి పార్థ సారథి రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేయడాన్ని ప్రస్తావిస్తూ.. కరోనా నియంత్రణకు వాడే రిమిడెసివర్ మందుపై ఎన్నో నిజాలు బయటకు వస్తున్నాయని, వాటిని సేకరిస్తున్నామన్నారు. 

Updated Date - 2022-05-25T00:04:57+05:30 IST