కార్యకర్తలతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశం

ABN , First Publish Date - 2022-02-25T20:44:56+05:30 IST

సంగారెడ్డి: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం తన కార్యకర్తలతో సమావేశమయ్యారు.

కార్యకర్తలతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశం

సంగారెడ్డి: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం తన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయటవారికంటే తమ పార్టీ వారే అనవసర ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను టీఆర్‌ఎస్‌లోకి వెళ్తానంటే అడ్డుకునే వారు లేరని అన్నారు. వ్యక్తిగత రాజకీయం కోసం కార్యకర్తలను ఇబ్బంది పెట్టనని చెప్పారు. రాహుల్ నాయకత్వంలో మార్చి 21న లక్ష మందితో సభ నిర్వహిస్తానని, ఆ సభలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. హైకమాండ్‌ను కలిసే వరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-02-25T20:44:56+05:30 IST