‘బీజేపీ ప్రభుత్వం.. గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసే కుట్ర చేస్తోంది’

ABN , First Publish Date - 2022-06-14T19:38:45+05:30 IST

ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్‌లో బీజేపీ ప్రభుత్వం.. గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసే కుట్ర జరుపుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు.

‘బీజేపీ ప్రభుత్వం.. గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసే కుట్ర చేస్తోంది’

హైదరాబాద్ : ఆర్ఎస్ఎస్(RSS) బ్యాక్ గ్రౌండ్‌లో బీజేపీ(BJP) ప్రభుత్వం.. గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసే కుట్ర జరుపుతోందని టీపీసీసీ(TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) పేర్కొన్నారు. అందుకే ఈడీ(ED) కేసుల ప్రయోగమని తెలిపారు. నెహ్రూ(Nehru) 16, ఇందిరా(Indira Gandhi) 6 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపారన్నారు. దేశం కోసం గాంధీల కుటుంబాన్ని త్యాగం చేశారన్నారు. మరి బీజేపీలో దేశం కోసం ఒక్కరైనా త్యాగం చేసినవారు ఉన్నారా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ బ్రిటీష్‌కి వత్తాసు పలికిందన్నారు. గాంధీని చంపిన గాడ్సేని బీజేపీ నేత ఒకరు పార్లమెంట్‌లో గొప్పవాడు అంటున్నారన్నారు. బ్యాంకులు లూటీ చేసిన నేతలంతా బీజేపీలో ఉన్నారన్నారు. వారి మీద ఈడీ ఉండదా..? అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబానికి తామంతా అండగా ఉంటామని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-06-14T19:38:45+05:30 IST