బీజేపీ-టీఆర్ఎస్ కొట్లాట రాజకీయం కోసమే: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-11-29T23:21:26+05:30 IST

వరి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రగడ చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కొనుగోలు ఆలస్యంతో ధాన్యం మొలకెత్తి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ-టీఆర్ఎస్ కొట్లాట రాజకీయం కోసమే: జగ్గారెడ్డి

హైదరాబాద్: వరి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రగడ చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కొనుగోలు ఆలస్యంతో ధాన్యం మొలకెత్తి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు కేసీఆర్ స్పందించడం వల్ల రైతులకు లాభం లేదన్నారు. రైతులకు వరి సాగు మానేయాలని చెప్పడం సరికాదన్నారు. యాసంగి తర్వాత.. ముందు పండిన పంటను కొనాలని ఆయన సూచించారు. బీజేపీ-టీఆర్ఎస్ కొట్లాట రాజకీయం కోసమే.. రైతుల కోసం కాదన్నారు. 

Updated Date - 2021-11-29T23:21:26+05:30 IST