కేంద్రమంత్రి కొడుకును ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-10-06T20:14:46+05:30 IST

రైతుల పొట్టిగొట్టి కేంద్రం తీసుకువచ్చే చట్లాలు చాలా ప్రమాదకరమైనవని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.

కేంద్రమంత్రి కొడుకును ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు: జగ్గారెడ్డి

హైదరాబాద్: రైతుల పొట్టిగొట్టి కేంద్రం తీసుకువచ్చే చట్లాలు చాలా ప్రమాదకరమైనవని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఆనాడు సోనియా, రాహుల్ గాంధీలు పార్లమెంట్‌లో వ్యతిరేకించారన్నారు. అప్పటి నుంచి రైతులు దీక్షలు, ధర్నాలు చేస్తున్నా కేంద్రంలో చలనం రాలేదన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  రైతులను బయటకు రానివ్వడం లేదని, పోలీసులతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. యూపీ ఘటనలో కేంద్రమంత్రి కొడుకును ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. పార్లమెంట్‌లో రైతుల కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే.. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని, బీజేపీ, కేసీఆర్, జగన్ ముగ్గురూ ఒక్కటేనని జగ్గారెడ్డి విమర్శించారు.

Updated Date - 2021-10-06T20:14:46+05:30 IST