ఆ హామీలే కేసీఆర్‌ను రెండోసారి సీఎంను చేశాయి: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-01-12T01:06:27+05:30 IST

ఈనెల 17న ప్రగతిభవన్ ఎదుట నిరసన దీక్ష చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఐదు ప్రధాన డిమాండ్లతో ప్రజా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఆ హామీలే కేసీఆర్‌ను రెండోసారి సీఎంను చేశాయి: జగ్గారెడ్డి

హైదరాబాద్: ఈనెల 17న ప్రగతిభవన్ ఎదుట నిరసన దీక్ష చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఐదు ప్రధాన డిమాండ్లతో ప్రజా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో అన్‌ఆథరైజ్డ్ లేఔట్ ప్లాట్లను రెగ్యులర్ చేయాలన్నారు. రైతులకు లక్ష రుణమాఫీని ఒకే విడతలో చెల్లించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీని 4 కిస్తీలుగా చెల్లించడం వల్ల మిత్తికే సరిపోతుందన్నారు. నిరుద్యోగ భృతి, 57 ఏళ్లకు పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. అలాగే మహిళా గ్రూపులకు రుణాలే ఇవ్వడం లేదన్నారు. ఈ హామీలే కేసీఆర్‌ను రెండోసారి సీఎంను చేశాయన్నారు. కానీ ఆ హామీలు మాత్రం అమలు కావడం లేదన్నారు. 

Updated Date - 2022-01-12T01:06:27+05:30 IST