గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జగదీష్ ఠాకూర్
ABN , First Publish Date - 2021-12-03T20:20:02+05:30 IST
గుజరాత్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా జగదీష్ ఠాకూర్ను కాంగ్రెస్ అధ్యక్షురాలు..
అహ్మదాబాద్: గుజరాత్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా జగదీష్ ఠాకూర్ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం నియమించారు. అమిత్ ఛావ్డా స్థానంలో జగదీష్ ఠాకూర్ కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపడుతున్నారు. గుజరాత్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఉన్న నేపథ్యంలో బీజేపీపై పట్టు సాధించే వ్యూహారచనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి నియమాకం చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగదీష్ ఠాకూర్ నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. అలాగే పీసీసీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి వైదొలుగుతున్న అమిత్ ఛావ్డా సేవలను కూడా పార్టీ కొనియాడినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.