భగత్ విజయం ఖాయం: జగదీష్ రెడ్డి

ABN , First Publish Date - 2021-04-08T17:19:03+05:30 IST

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తోందని జగదీష్ రెడ్డి అన్నారు.

భగత్ విజయం ఖాయం: జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ నోముల భగత్ విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ధరలు పెంచుతూ నరేంద్రమోదీ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.


మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సాగర్‌లో పచ్చని పొలాలు దర్శనం ఇస్తున్నాయన్నారు. టీఆరెస్ అభ్యర్థి నోముల భగత్‌కు భారీ మెజార్టీ వస్తుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి జాడ లేకుండా పోతారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Updated Date - 2021-04-08T17:19:03+05:30 IST