ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-08-12T09:23:47+05:30 IST

భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ప్రమాణ స్వీకారం

హిందీలో.. భగవంతుడి సాక్షిగా ప్రమాణం

హాజరైన ప్రధాని, కోవింద్‌, వెంకయ్య నాయుడు


న్యూఢిల్లీ, ఆగస్టు 11: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన హిందీలో భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేసి.. బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతులు ఎం.వెంకయ్య నాయుడు, హమీద్‌ అన్సారీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్‌ను ప్రముఖులు అభినందించారు. అంతకు ముందు ధన్‌ఖడ్‌ రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. గాంధీజీ స్ఫూర్తి, ఆశీస్సులతో భారతమాత సేవలో కొనసాగుతానంటూ ఆయన ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-08-12T09:23:47+05:30 IST