బూతులు విని నా అభిమానులకు బీపీ వచ్చింది: CM Jagan
ABN , First Publish Date - 2021-10-20T18:24:49+05:30 IST
ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా రెచ్చిపోయి బూతులు తిడుతున్నారని.. తమపై ఆప్యాయత చూపే అభిమానులు వాళ్ల బూతులు వినలేక బీపీ వచ్చి రియాక్ట్ అవుతున్నారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
అమరావతి: ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా రెచ్చిపోయి బూతులు తిడుతున్నారని.. తమపై ఆప్యాయత చూపే అభిమానులు వాళ్ల బూతులు వినలేక బీపీ వచ్చి రియాక్ట్ అవుతున్నారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. సొంత పార్టీ దాడులపై జగన్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజల ప్రేమను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఓ వర్గం మీడియా కూడా జీర్ణించుకోలేకపోతోంది. ప్రభుత్వాన్ని దారుణంగా బూతులు తిడుతున్నారు. ఇలాంటి బూతులు ఎప్పుడూ వినలేదు. కావాలని తిట్టించి రెచ్చగొడుతున్నారు. కులాల, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. వ్యవస్థలను కూడా మ్యానేజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులను చూసి ఓర్వలేకపోతున్నారు. అభివృద్ధి పనులను కోర్టు కేసులతో అడ్డుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు.