ఓటేయలేదని పది కుటుంబాలు వెలి
ABN , First Publish Date - 2021-03-04T08:55:19+05:30 IST
ఇటీవల జరగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయలేదన్న కారణంతో ఆ పార్టీకే చెందిన పది కుటుంబాలను
వైసీపీలో అంతర్గత విభేదాల ఫలితం
కాజులూరు (కరప), మార్చి 3: ఇటీవల జరగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయలేదన్న కారణంతో ఆ పార్టీకే చెందిన పది కుటుంబాలను సంఘ బహిష్కరణ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం జగన్నాధగిరి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జగన్నాధగిరి గుత్తులవారిపేటకు చెందిన పది కుటుంబాల సభ్యులు పెద్దల మాట కాదని వైసీపీ బలపర్చిన అభ్యర్థికి కాకుండా రెబల్ అభ్యర్థికి ఓటేశారు. దీనివలన బెట్టింగ్లో రూ.15 లక్షలు పోగొట్టుకున్నామని కొంతమంది పెద్దలు వారిని వెలివేశారు. దీనిపై మంగళవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు తమకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. బుధవారం కాజులూరు పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డిని కూడా కలిసి తమను రక్షించాలని కాళ్లమీదపడి ప్రాధేయపడినా ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.