ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసిన జగన

ABN , First Publish Date - 2022-01-15T05:27:38+05:30 IST

ముఖ్యంత్రి వైఎస్‌ జగన ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కి నిరుద్యోగులను, ఉద్యోగులను నిలువునా మోసం చేశాడని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా తెస్తాడని 22 మంది ఎంిపీలను ఇస్తే ప్రజల ఆశలపై నీళ్లుచల్లాడని అన్నారు.

ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసిన జగన

తులసిరెడ్డి ధ్వజం

కడప(కలెక్టరేట్‌), జనవరి 14: ముఖ్యంత్రి వైఎస్‌ జగన ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కి నిరుద్యోగులను, ఉద్యోగులను నిలువునా మోసం చేశాడని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా తెస్తాడని 22 మంది ఎంిపీలను ఇస్తే  ప్రజల ఆశలపై నీళ్లుచల్లాడని అన్నారు. ప్రతి ఏటా జనవరి 1 వతేదీన జాబ్‌ క్యాలండర్‌ ప్రకటిస్తామని నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు నజీర్‌ అహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-15T05:27:38+05:30 IST