ఎస్సీ వర్గీకరణపై జగన్ మౌనం వీడాలి: మందకృష్ణ
ABN , First Publish Date - 2020-09-28T10:25:24+05:30 IST
ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక
బొబ్బిలి/ఎచ్చెర్ల, సెప్టెంబరు 27: ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయంలో భాగమేనని అన్నారు. గత నెల 27న ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనంఎస్సీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని తీర్పునిచ్చిందన్నారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ అసెంబ్లీలో తీర్మానం చేయించారని, ఉషామెహ్రా కమిషన్ వేశారన్నారు.