జగన్ క్షమాపణ చెప్పాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2022-03-17T23:56:45+05:30 IST
‘ఓ వైపు సారా దుకాణాలపై దాడులు చేస్తూ విక్రయించే వారిని అరెస్టు చేస్తున్నారు. సారా తయారీ చేసే బెల్లపు ఊటను ద్వంసం చేస్తూ సారాను స్వాధీనం చేసుకుంటున్నారు.
జంగారెడ్డిగూడెం: ‘ఓ వైపు సారా దుకాణాలపై దాడులు చేస్తూ విక్రయించే వారిని అరెస్టు చేస్తున్నారు. సారా తయారీ చేసే బెల్లపు ఊటను ద్వంసం చేస్తూ సారాను స్వాధీనం చేసుకుంటున్నారు. దీనిని బట్టి అర్థం కావడం లేదా ? సారా ఏరులై ఏ స్థాయిలో పారుతుందో.. మీ అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రే అసెంబ్లీలో ఇవన్నీ సహజ మరణాలే.. సారా తాగడం వల్ల కాదని చెప్పడం.. సిగ్గు చేటు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సారా మరణాలపై న్యాయ విచారణ జరిపించి బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను పక్కదోవ పట్టించి సాక్షాత్తూ అసెంబ్లీలోనే అవాస్తవాలు చెప్పిన సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.