జగన్ రాజకీయ కుతంత్రాలు చేస్తున్నారు: శైలజానాథ్‌

ABN , First Publish Date - 2021-11-23T02:34:31+05:30 IST

3 రాజధానుల బిల్లును రద్దు చేశామని ప్రకటిస్తూనే.. మళ్లీ త్వరలోనే తీసుకొస్తామనడంలో ఆంతర్యం ఏంటి? అని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రశ్నించారు.

జగన్ రాజకీయ కుతంత్రాలు చేస్తున్నారు: శైలజానాథ్‌

అనంతపురం: 3 రాజధానుల బిల్లును రద్దు చేశామని ప్రకటిస్తూనే.. మళ్లీ త్వరలోనే తీసుకొస్తామనడంలో ఆంతర్యం ఏంటి? అని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మంత్రులు శ్రీబాగ్ ఒడంబడిక మరొక్కసారి చదివి మాట్లాడాలన్నారు. రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా సీఎం జగన్ ప్రవర్తించాలన్నారు. జగన్ రాజకీయ కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రకటించినప్పుడు మీ తెలివితేటలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ఆనాడు స్వాగతించి ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలని శైలజానాథ్ కోరారు.

Updated Date - 2021-11-23T02:34:31+05:30 IST